బాండ్ పేపర్ల ఇజ్జత్ తీసిన కాంగ్రెస్: హరీష్

83చూసినవారు
బాండ్ పేపర్ల ఇజ్జత్ తీసిన కాంగ్రెస్: హరీష్
కాంగ్రెస్ పై BRS నేత, మాజీమంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. బాండ్ పేపర్లకు జర ఇజ్జత్ ఉండేనని.. దానిని కాంగ్రెస్ పోగొట్టిందన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన రోడ్ షోలో హరీష్ మాట్లాడుతూ.. బాండ్ పేపర్ల మీద 6 గ్యారంటీలు రాసి ఇచ్చాక పేపర్ విలువ పూర్తిగా పోయిందని విమర్శించారు. ముందు ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు రేవంత్కు లేదని.. 4 నెలల్లో కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్