బీజేపీలోకి కాంగ్రెస్ మహిళా ఎంపీ?

556చూసినవారు
బీజేపీలోకి కాంగ్రెస్ మహిళా ఎంపీ?
లోక్‌సభ ఎన్నికల ముందు జార్ఖండ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుంది. సింగ్‌భూమ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ, మాజీ సీఎం మధుకోడా భార్య గీతా కోడా సోమవారం బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జేఎంఎం, ఇతర పార్టీలతో పొత్తులపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలతో ఆమె సంప్రదింపులు సాగిస్తున్నట్లు సమాచారం. సాయంత్రంలోపు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్