సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్కు ఎంపీ స్థానాలు వచ్చి ఉంటే సింగరేణి ప్రైవేటీకరణకాకుండా అడ్డుకునేదని కేటీఆర్ అన్నారు. ఏపీలో వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా టీడీపీ అడ్డుకోబోతోందని చెప్పారు. సింగరేణి మెడ మీద కేంద్రం కత్తిపెడితే.. దానికి సీఎం రేవంత్రెడ్డి సాన పెడుతున్నారని మండిపడ్డారు.