మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ కానిస్టేబుల్ తన తండ్రిపై దాడి చేశాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీలో మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రి బుచ్చన్నపై కొడుకు రాజేందర్ దాడి చేశాడు. నిందితుడు భీమ్గల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా కఠిన చర్యలు తీసుకోవాలని సీపీకి బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.