చైనాలో తాజాగా వంట నూనె రవాణా కుంభకోణం కలకలం రేపింది. ప్రమాదకర రసాయనాలు తరలించిన ట్యాంకర్లను శుభ్రం చేయకుండానే వాటిల్లో వంట నూనెను నింపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది.