బీజేపీ ఎంపీకి కోర్టు వారెంట్

65చూసినవారు
బీజేపీ ఎంపీకి కోర్టు వారెంట్
మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో నిందితురాలు, బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారెంట్ జారీ చేసింది. విచారణ కోసం కోర్టుకు ఆమె హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లహోటి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై రూ.10 వేల విలువైన బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. మార్చి 20లోగా నివేదిక సమర్పించాలని దర్యాప్తు సంస్థను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్