గుజరాత్లోని సూరత్ నగర పరిధి బార్డోలీలో తాజాగా విషాద ఘటన జరిగింది. ఓ ఖాళీ స్థలంలో నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై ఆవు దాడి చేసింది. పలుమార్లు కొమ్ములతో ఆ యువకుడిని పొడిచి గాయపరిచింది. అంతేకాకుండా కింద పడేసి కాళ్లతో యువకుడిని తొక్కింది. తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశువుల సంచారాన్ని అరికట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.