పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని

63చూసినవారు
పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని
పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాల‌ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అలాగే వారి పై క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్