
నేడు రాయలసీమలో పిడుగులతో వర్షాలు
AP: రాయలసీమలో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. నిన్న పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత, 17 జిల్లాల్లో 41°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.