బెంగుళూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం అన్ననే చంపేశాడు తమ్ముడు. వివరాల్లోకి వెళ్తే.. వీరి తండ్రి బొమ్మనహళ్లిలో 65కు పైగా ఇళ్లు నిర్మించాడు. తండ్రి మరణంతో ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో శ్రీకాంత్ తమ్ముడైన నాగేంద్ర ఇంటికి రాగా అతను కత్తి తీసుకొని అన్నను తీవ్రంగా పొడవడంతో చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.