బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. కూతురు తల్లితో కలిసి భర్తనే చంపేసింది. లోక్నాథ్, యశస్వి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం యశస్వి కుటుంబసభ్యులకు తెలిసింది. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడం, అలాగే లోక్నాథ్కు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో లోక్నాథ్కు మత్తు మందు కలిపిన ఫుడ్ తినిపించి గొంతు కోసి హత్య చేశారు. విచారణలో హత్య అని తేలడంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.