గంజాయి స్మగ్లింగ్ కేసులో సంగీతా సాహును అనే మహిళను తెలంగాణ పోలీసులు ఒడిశాలో అరెస్టు చేశారు. ఆమెపై సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో ఒక కేసు, ధూల్పేట్లో నాలుగు కేసులు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఫేమస్ అయిన ఆమె, అనేక రాష్ట్రాల్లోని గంజాయి వ్యాపారస్తులతో సంబంధాలు కలిగి ఉంది. నాలుగేళ్ల క్రితం గంజాయి హోల్సేల్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగీతా ఈ అక్రమ రాకెట్ను నడిపిస్తుంది.