యూపీలో అమానుష ఘటన జరిగింది. ఓ మహిళకు మద్యం తాగించి ఆపై హత్య చేశారు. అంజలి అనే వివాహిత ఎటావాలో ఓ స్థలం కొనుగోలు కోసం శివేంద్ర యాదవ్ (26)కు రూ 6.లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే అతను స్థలం రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో అంజలిని హత్య చేయాలని ప్లాన్ చేసిన శివేంద్ర ఆమెను తన ఇంటికి పిలిపించి మద్యం తాగించి హత్య చేశాడు. పోలీసుల విచారణలో నిజం తేలడంతో నిందితులను అరెస్ట్ చేశారు.