క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి విద్యార్థి బలి

64చూసినవారు
క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి విద్యార్థి బలి
AP: క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి విద్యార్థి బలైన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు బెట్టింగ్‌‌లో డబ్బులు పెడితే లాభాలు వస్తాయని భావించి, రూ. 80 వేలు పొగొట్టుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురై.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో పవన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత పోస్ట్