ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది. వారికి జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించినట్లు ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. తీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్, కవితలను వర్చువల్గా కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు.