'రెమాల్' తుఫాను బీభత్సం.. 25 మంది మృతి

52చూసినవారు
'రెమాల్' తుఫాను బీభత్సం.. 25 మంది మృతి
మిజోరంలో 'రెమాల్' తుఫాను బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేని వర్షం, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 25 మంది మృతి చెందారని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పలువురు గల్లంతయ్యారని తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. కాగా నిన్న ఐజ్వాల్ జిల్లాలో రాతి క్వారీ కూలిపోయిన ఘటనలో 14 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్