వార్‌ జోన్‌గా మారిన దండకారణ్యం

72చూసినవారు
వార్‌ జోన్‌గా మారిన దండకారణ్యం
ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం వార్‌ జోన్‌గా మారింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 16వ తేదీన జరిగిన కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తరువాత జరిగిన కోర్చోలి ఎన్‌కౌంటర్‌లో 13 మంది, మే 11వ తేదీన బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోలు చనిపోయారు. నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో 10 మంది, తాజాగా ఇవాళ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో 8 మంది మృతి చెందారు.

సంబంధిత పోస్ట్