ఛత్తీస్ఘడ్ దండకారణ్యం వార్ జోన్గా మారింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 16వ తేదీన జరిగిన కాంకేర్ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తరువాత జరిగిన కోర్చోలి ఎన్కౌంటర్లో 13 మంది, మే 11వ తేదీన బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోలు చనిపోయారు. నారాయణపూర్ ఎన్కౌంటర్లో 10 మంది, తాజాగా ఇవాళ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరో 8 మంది మృతి చెందారు.