క్షీణించిన ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోగ్యం (వీడియో)

59చూసినవారు
ఢిల్లీకి హర్యానా నీటిని విడుదల చేయాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె రక్తంలో చక్కెరస్థాయులు పూర్తిస్థాయిలో పడిపోయాయి. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఆమె లోక్ నాయక్ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో ఉన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆప్ పార్టీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్