రామ్‌లల్లా దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

71చూసినవారు
శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో రామ్‌లల్లా దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే రామభక్తులు బారులు తీరారు. శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా హనుమాన్ గర్హిని దర్శించుకుంటున్నారు. రామాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు రామాయణాన్ని భక్తులు తిలకిస్తున్నారు. ఈ ప్రత్యేక రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్ దంపతులు ట్రస్ట్‌కు అందించారు.

సంబంధిత పోస్ట్