25 కేజీల బంగారు అభరణాలతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. వీడియో వైరల్

3639చూసినవారు
తిరుపతి శ్రీవారి ఆలయం వద్ద శుక్రవారం ఇద్దరు గోల్డ్ మ్యాన్లు హల్చల్ చేశారు. గోల్డెన్ బాయ్స్ గా పాపులర్ అయిన పూణేకు చెందిన సన్నీ వాగచోరీ, సంజయ్ గుజర్‌లు మెడ నిండా బంగారు చైన్లు.. చేతి నిండా బంగారు కవచాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు వారు 25 కేజీల బంగారాన్ని ధరించారు. గోల్డ్ మ్యాన్లను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. కొంతమంది భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. వారు ప్రయాణించే కారు కూడా గోల్డ్ కలర్‌లో ఉంది.

సంబంధిత పోస్ట్