నాలుగో రోజుకు దీక్ష.. క్షీణిస్తోన్న ఆతిశీ ఆరోగ్యం

82చూసినవారు
నాలుగో రోజుకు దీక్ష.. క్షీణిస్తోన్న ఆతిశీ ఆరోగ్యం
హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నీటిని విడుదల చేయాలన్న డియాండ్‌‌తో ఆప్ మంత్రి ఆతిశీ చేపట్టిన నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు దీక్ష వల్ల ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రిలో చేరాలని కోరారు. అయితే దీనిపై ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ ‘‘నా రక్తపోటు, చక్కెర స్థాయిలు పడిపోతున్నాయి. అయినా నేను ఢిల్లీ ప్రజల తరపున పోరాడతాను’’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్