బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ (తెల్లరేషన్కార్డు ఉన్నవారికి) బతుకమ్మ పండుగకు పది రోజుల ముందే చీరలను పంపిణీ చేసేది. ఏడెనిమిది నెలల ముందు చేనేత కార్మికులకు చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చేది. కానీ, ఈసారి చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వకుండా వారి ఉపాధిని కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీసింది. ఆడబిడ్డలకు చీరల పంపిణీ కానుకను ఎత్తేసింది. ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి కేవలం రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనతో సరిపెట్టారు.