జిల్లా పేరు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

577చూసినవారు
జిల్లా పేరు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యా నగర్‌గా, పూణెలోని వెల్హే తాలూకా పేరును 'రాజ్‌గడ్'గా మార్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంతోషం వ్యక్తం చేశారు. 13 కోట్ల మంది పౌరుల ముఖ్యమైన కోరిక నెరవేరిందన్నారు. దీనికి ప్రత్యేక కృషి చేసిన ఎమ్మెల్యేలు సంగ్రామ్ జగ్తాప్, దత్తమామ భర్నే, అశుతోష్ కాలే, నితిన్ పవార్‌లను ఆయన ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్