చల్లటి ఆహారం మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని ప్రోటీన్లు, విటమిన్లు నశిస్తాయి అంటున్నారు నిపుణులు. అంతేకాదు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొన్ని సార్లు అవి ఫుడ్ పాయిజనింగ్ అవుతాయని హెచ్చరిస్తున్నారు. అయినా ఒకసారి ఉడకబెట్టి తినవచ్చు అంటున్నారు నిపుణులు. కానీ ఒకసారి వండిన అన్నం, సాంబార్ ఇతర వంటకాలు మళ్లీ మళ్లీ మాత్రం వేడి చేసుకొని తినకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వేడిగా వండుకుని తినడమే మంచిది.