IPLకు పోటీగా పాక్ క్రికెట్ బోర్డు PSLను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండు టోర్నీల్లో ప్రైజ్ మనీ తేడా ఎంతో తెలుసా? ఐపీఎల్లో గత ఏడాది విజేతలకు రూ. 20 కోట్ల ప్రైజ్మనీ దక్కగా.. రన్నరప్కు రూ.13 కోట్లు లభించాయి. అదే పీఎస్ఎల్ టైటిల్ను సొంతం చేసుకున్న ఇస్లామాబాద్ యునైటెడ్కు 14 కోట్ల పాకిస్థాన్ రూపాయలు ప్రైజ్మనీగా దక్కింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 4.15 కోట్లు.