కొన్ని ఆలయాల్లో సంగీతాన్ని వినిపించే స్తంభాలు ఉన్నాయి. వీటిలో తడితే స్వరాలు పలికేవి కొన్నయితే, వాటికి ఉన్న రంధ్రాల్లో ఊదితే సంగీతాన్ని వినిపించేవి మరికొన్ని. ఇలాంటి వాటిలో ప్రధానమైంది కర్ణాటకలోని హంపీ విజయవిఠల దేవాలయం. 15వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ప్రధాన స్తంభాలన్నీ ఏడు చిన్న స్తంభాలుగా గ్రానైట్తో నిర్మించి ఉంటాయి. వీటిని తడితే ఒక్కో స్తంభం ఒక్కో శబ్దాన్ని పలుకుతుంది. అదే వీటిని గంధపుచెక్కతో మీటితే సప్తస్వరాల్ని లయబద్ధంగా పలుకుతాయట.