వంట నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించి, ఆ నూనెలో ఆహారాన్ని వేయించి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. అంతేకాదు కాలేయం, మెదడుకు కూడా తీవ్రంగా హాని కలుగుతుంది. ఆయిల్ ను ఎక్కువసార్లు ఉపయోగించి తయారుచేసిన ఆహారపదార్థాలు తినడం వల్ల మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయి. దీని వల్ల ఫ్యాటీ లివర్, ఇతర కాలేయ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయని వారు అంటున్నారు.