సౌందర్య చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఓ కోరిక కోరిందట. ఎయిర్పోర్టుకు వెళ్లేముందు తన వదినను కాటన్ చీర, కుంకుమ తీసుకురమ్మని అడిగిందట. అప్పుడు తన దగ్గర కాటన్ చీర లేకపోవడంతో ఒకటి కొని తీసుకురమ్మని కోరిందట. అప్పటికే ఆమె బీజేపీలో చేరడంతో ఆ చీర కట్టుకుని ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకుంది సౌందర్య. కానీ ఇంతలోనే సమయం కావస్తోందని విమానం ఎక్కేయడం, అది కూలిపోవడంతో సౌందర్య అక్కడికక్కడే మరణించింది.