నిజాం కాలం నాటి పురాతన పెట్రోల్ పంప్ ఎక్కడుందో తెలుసా.? హైదరాబాద్ KBR పార్కులో ఇటీవల బయటపడింది. నిజాం నవాబులు తమ వాహనాలకు ఇంధనం నింపుకునేందుకు ఈ ప్రైవేట్ పంప్ను ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల రాజు అల్లూరి అనే వ్యక్తి ఈ పురాతన పెట్రోల్ పంప్ను గుర్తించారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.