శరీరంలో ఉప్పు శాతం పెరిగితే.. అది రక్తపోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి హైపర్టెన్షన్కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు.. గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని చెప్పారు. తలనొప్పి, తల తిరగడం, వేగవంతమైన హృదయ స్పందన లాంటివి కనిపిస్తాయన్నారు. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని అదనపు ఉప్పు తొలగిపోతుందని వైద్యులు చెబుతున్నారు.