అన్నదాత ఆగమైండు.. నేతన్న చితికిపోతుండు: KTR

57చూసినవారు
అన్నదాత ఆగమైండు.. నేతన్న చితికిపోతుండు: KTR
తెలంగాణలో రైతన్నల, నేతన్నల పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్ చేశారు. 'కపట కాంగ్రెస్ పాలనలో.. కడుపునింపే అన్నదాత ఆగమైండు.. చేనేత కార్మికుడు చితికిపోతుండు. ప్రభుత్వ వైఫల్యం వల్ల.. ప్రతి నేతన్న నడిరోడ్డు మీద పడ్డడు. నాడు తెలంగాణ అవకాశాల గని.. చేనేత కార్మికుడికి చేతినిండా పని.. కానీ నేడు చేతకాని కాంగ్రెస్ పాలన.. కార్మికుల పాలిట శని. మూలనపడ్డ మగ్గం సాక్షిగా హెచ్చరిక.. భస్మాసుర హస్తానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్