ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది.దీంతోౌ కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేశారు. ఆ సమయంలో అధికారులు కామెరూనియన్ దేశానికి చెందిన ప్రయాణికుడి వస్తువులను తనిఖీ చేయగా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.