ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ తీర్మానం

81చూసినవారు
ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ తీర్మానం
బీహార్‌లో అధికారంలో ఉన్న జనతా దళ్ యునైటెడ్ - జేడీయూ సంచలన నిర్ణయం తీసుకుంది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసింది. తాజాగా నిర్వహించిన జేడీయూ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో ఉన్న ఆర్థిక, అభివృద్ధి తేడాలను పేర్కొన్న జేడీయూ.. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే దీర్ఘకాల అవసరాన్ని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్