భూకంపం ఎఫెక్ట్.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని

54చూసినవారు
భూకంపం ఎఫెక్ట్.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని
థాయ్‌లాండ్‌లో తీవ్ర భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంపం ధాటికి అక్కడి పలు భవనాలు పేకమేడల్లా కూలాయి. ఈ ప్రమాదంలో వందలమంది చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. భారత్‌లోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం పడింది. కోల్‌కతా, ఇంఫాల్, మోఘాలయాలో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. మోఘాలయ ఈస్ట్‌గారో హిల్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 4 నమోదైంది.

సంబంధిత పోస్ట్