మేఘాలయలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) వెల్లడించింది. వెడల్పు : 25.17, పొడవు : 92.13, 25 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్సిఎస్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.