ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్ సింగ్ నామినేషన్ను ఈసీ ఆమోదించింది. ఆయన పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆయన అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు. వారిస్ పంజాబ్ దే వ్యవస్థాపకుడు దీప్ సిద్ధూ మరణం తర్వాత అమృత్పాల్ వెలుగులోకి వచ్చాడు. ఇతడికి ISIS తోనూ సంబంధాలున్నట్లు తేలింది.