తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత బయటపడిన గొర్రెల పంపిణీ స్కీమ్లో అక్రమ నగదు రవాణా జరిగిందని గుర్తించిన ఈడీ అధికారులు పూర్తి వివరాలు కావాలని తెలంగాణ సీఐడీ అధికారులకు లేఖ రాశారు. గొర్రెల స్కామ్లో జరిగిన 700 కోట్ల అవినీతి జరిగిందని పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలను తెలంగాణ ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన వివరాల ఆధారంగా గొర్రెల స్కామ్పై విచారణ చేపట్టాలని నిర్ణయించింది.