టీఎంసీ నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి కూడా నోటీసులు అందాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద వారిని గురువారం ప్రశ్నించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) కింద ఒక దేశంలోని ఖాతా నుంచి మరో దేశంలోని ఖాతాకు నగదు చెల్లింపులు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.