లోక్సభ మూడో దశ ఎన్నికలలో భాగంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 స్థానాలకు రేపు పోలింగ్ జరగనున్నది. NDA కూటమి గత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన గుజరాత్, ఛత్తీస్గఢ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ సహా పలు రాష్ట్రాల్లో ఈ మూడో దశ ఎన్నికలు జరుగనున్నాయి. 120 మంది మహిళలతో సహా 1300 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.