మాజీ ఐఏఎస్ ట్రైనీపూజా ఖేద్కర్పై కేంద్రం యాక్షన్ తీసుకుంది. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. IAS (ప్రొబేషన్) రూల్స్, 1954లోని రూల్ 12 ప్రకారం పూజా ఖేద్కర్ను డిశ్చార్జ్ చేస్తూ తక్షణమే అమలులోకి తెచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. ఆమె సర్వీస్ను నిలిపివేయడంతో పాటు భవిష్యత్లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది.