భారత్లోకి టెస్లా కార్ల కంపెనీ వస్తుందని గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. దేశంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేసే నిమిత్తం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్తో టెస్లా సంస్థ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అంబానీతో కలిసి ఎలాన్ మస్క్ ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.