ఈపీఎస్1995లో కేంద్రం మార్పులు చేసింది. ఉద్యోగంలో చేరిన 6నెలల్లోనే ఉద్యోగులు ఈపీఎస్ నుంచి డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు 'టేబుల్ డీ'ని సవరించింది. ఈ మార్పులతో 23లక్షల మందికిపైగా ప్రయోజనం పొందనున్నారు. 10ఏళ్ల సర్వీస్ ప్రాతిపదికన లెక్కించే బెనిఫిట్స్ను ఇకపై పని చేసిన నెలల ఆధారంగా లెక్కిస్తారు. కానీ ఈ స్కీమ్లో 10ఏళ్లకు ముందే విత్డ్రా చేసుకుంటే బెనిఫిట్స్ అందవు.