వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త ఈవీ పాలసీ 2.0ని రూపొందిస్తోంది. రోడ్ల మీద ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచే విధంగా ఈ పాలసీలో అనేక రూల్స్ ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు, ఈవీ కొనే మహిళలకు బంపర్ ఆఫర్ని కూడా ఇస్తుందని సమాచారం. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనే ఢిల్లీ మహిళలకు షరతులతో కూడిన రూ. 30వేల సబ్సిడీని ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.