ఏపీలోని నూజివీడులో స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్యపరికరాలను మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. వెలగపూడి రాజ్కుమార్ ట్రస్ట్ అందజేసిన రూ.13 లక్షల విలువైన పరికరాలు ప్రారంభించిన అనంతరం మంత్రి పార్థసారథి ప్రసంగించారు. ప్రజాసేవలో కార్పొరేట్ సంస్థలు భాగస్వాములు కావడం అభినందనీయమని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.