రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో కొత్తదనం లేదని, కొత్త సీసాలో పాత సారాలా ఉందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పెదవివిరిచారు. ఆమె ప్రసంగం మొత్తంలో మైనారిటీల సమస్యలు, నిరుద్యోగం ఊసెత్తలేదని ఆరోపించారు. దేశంలో ప్రతిచోటా ప్రశ్నాపత్రాల లీకేజ్ జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాషాయ పాలకులు 25 లక్షల యువత జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు.