కేటీఆర్ పై మాజీ ఐఏఎస్ ఫైర్

1764చూసినవారు
కేటీఆర్ పై మాజీ ఐఏఎస్ ఫైర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు. కోనాపూర్లో ప్రభుత్వ పాఠశాల నిర్మాణాన్ని పూర్తిచేశామని, తన అమ్మమ్మ సంతోషిస్తారని మంత్రి KTR చేసిన ట్వీట్ కు ఆయన స్పందించారు. 'మీ అమ్మమ్మ మాత్రమే సంతోష పడాలా KTR? మిగతా 26 వేల మంది అమ్మమ్మల సంగతేంటి? మనఊరు మనబడి అంటివి. రూ.7,268 కోట్లు అంటివి. ఇప్పటికి రూ. 430 కోట్లే ఖర్చు పెడితివి. మిగతాచోట్ల ఇలాంటి భవనాలు కడితే మెచ్చుకుంటాం' అన్నారు.

సంబంధిత పోస్ట్