రైతులకు నీళ్లివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ పేజ్-2 ద్వారా నీళ్లిస్తామంటేనే రైతులు పంటలు వేశారని అన్నారు. ఒక్కో రైతు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి ఆగమయ్యారని వ్యాఖ్యానించారు. 3నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్పై బురద జల్లేందుకు రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు.