లోక్సభ ఎన్నికలకు ముందు హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి రామ్లాల్ మార్కండ మంగళవారం రాజీనామా చేశారు. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఉప ఎన్నికల్లో టికెట్ కేటాయించింది. దీంతో రామ్లాల్ మార్కండ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తరుపున ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.