సామాజిక భద్రత పింఛన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.4 వేల పింఛను పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని
టీడీపీ, జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మందికి రూ.1,939 కోట్లు ఖర్చవుతోంది. ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు చొప్పున, వికలాంగులకు రూ.6 వేల పింఛనుకు జులై 1న పంపిణీ చేయడానికి రూ.4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.