లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. 48 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం 9 స్థానాలు దక్కించుకోగా ఎన్డీయే కూటమిగా 17 సీట్లను గెలుపొందింది. ఇండియా కూటమి ఏకంగా 30 స్థానాలు గెలిచింది. ఈ ఫలితాలకు బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే అతని రాజీనామా ప్రతిపాదన కేవలం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ఒత్తిడి తీసుకురావడానికే అని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు.